ట్యాంక్బండ్ వద్ద 50వేల సీసీ కెమెరాలతో నిఘా
ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) అంజనీకుమార్ కోరారు. ట్యాంక్బండ్ వద్ద రేపు జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు ....
గణేశ్ నిమజ్జనానికి 15వేల మంది పోలీసులతో బందోబస్తు
వెల్లడించిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
హైదరాబాద్: ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) అంజనీకుమార్ కోరారు. ట్యాంక్బండ్ వద్ద రేపు జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 30వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందన్నారు. రేపు జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి 15వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రధాన కూడళ్ల వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. పాతబస్తీ నుంచి నిమజ్జనానికి వచ్చే వాహనాలు కొన్ని నాళాల మరమ్మతుల కారణంగా దారి మళ్లిస్తున్నామన్నారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 50వేల సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని సీపీ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్ను అంజనీకుమార్ విడుదల చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా హుస్సేన్సాగర్లోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
భాగ్యనగర వాసులు ఎదురుచూసే ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర సాగనుంది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని మొదట్లో ఉత్సవ సమితి సభ్యులు భావించినప్పటికీ.. భక్తుల కోరికతో పాటు పోలీసుల నుంచి కూడా అనుమతి లభించడంతో యథాతథంగా ఊరేగింపు కొనసాగి హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, పాత సెక్రటేరియట్ మీదుగా వెళ్లి క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..