IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు 

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు కలెక్టర్లు మారారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated : 31 Aug 2021 00:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా శరత్‌, పరిశ్రమలశాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్‌, వ్యవసాయశాఖ కార్యదర్శిగా రఘునందర్‌రావు, యువజన సర్వీసుల సంచాలకులుగా వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా అబ్దుల్‌ అజీం నియమితులయ్యారు. ఇక పలు జిల్లాలకు కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కామారెడ్డి కలెక్టర్‌గా జితేశ్‌ పాటిల్‌, వికారాబాద్‌ కలెక్టర్‌గా నిఖిల, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌, జోగులాంబ గద్వాల కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి, వరంగల్‌ కలెక్టర్‌గా గోపి, జనగామ కలెక్టర్‌గా శివలింగయ్య, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా శశాంక నియామకమయ్యారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు