హిమాచల్ప్రదేశ్లో జాతీయ ఐస్ హాకీ టోర్నమెంట్
హిమాచల్ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ రింక్లో జాతీయ ఐస్ హాకీ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు.
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ రింక్లో జాతీయ ఐస్ హాకీ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. భారత ఐస్ హాకీ అసోసియేషన్ ఈ ఓపెన్ ఎయిర్ రింక్ను అభివృద్ధి చేశారు. ‘‘అండర్-20 ఐస్ హాకీ టోర్నమెంట్ను మొదటిసారిగా హిమాచల్ప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. జనవరి 27 నుంచి ఈ టోర్నమెంట్ మొదలుకానుంది.’’ అని భారత ఐస్ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హర్జిందర్ సింగ్ తెలిపారు. గురువారం కాజా పట్టణంలో ఒక శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఐస్ రింక్ 31×61 మీటర్ల పరిమాణంలో తయారు చేశారు. ఇది భూమికి 3,720 మీటర్ల ఎత్తులో, లేహ్ కన్నాపైన ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. ఇక్కడ త్వరలో స్కీయింగ్ను కూడా ప్రారంభిస్తామని హర్జిందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది నుంచి 20 సంవత్సరాలలోపు చిన్నారులకు ఐస్ హాకీలో శిక్షణనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ కోచ్ అమిత్ బెర్వాల్ ఆధ్వర్యంలో 165 మంది శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో కొందరిని జాతీయ టోర్నమెంటుకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా క్రీడాధికారి జివాన్ నేగి మాట్లాడుతూ.. ఇక్కడ చిన్నారుల్లో ఐస్ హాకీ పట్ల స్పందనను తెలుసుకొనేందుకు ఒక టెన్నిస్ కోర్టును హాకీ రింక్గా మార్చామని తెలిపారు. దీనికి మంచి స్పందన లభించడంతో శాశ్వత రింక్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్