రిపోర్టింగ్లో అంతరాయం: ‘దోషి’ ఎవరంటే..?
సీరియస్గా సాగుతున్న లైవ్ రిపోర్టింగ్కు ఒకరు అడ్డొచ్చారు. విలేకరి ఏకాగ్రతకు రెండుసార్లు భంగం కలిగించారు.
ఇంటర్నెట్ డెస్క్: సీరియస్గా సాగుతున్న లైవ్ రిపోర్టింగ్కు ఒకరు అడ్డొచ్చారు. విలేకరి ఏకాగ్రతకు రెండుసార్లు భంగం కలిగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సదరు విలేకరి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఐతే ఆ దుండగుడి చేష్టలు రెండు రోజులు కూడా కాకుండానే 2.2 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. అదేంటీ అనుకుంటున్నారా.. ఆ ‘దోషి’ ముద్దొచ్చే ఓ పిల్లికూన మరి!
ఆడుకోవాలనే సరదా పుట్టిందంటే పిల్లి పిల్లలు సమయం, సందర్భం చూడవు. అవి ఉన్నచోట ఎవరున్నా పట్టించుకోవు. ఇదే విధంగా ఓ పిల్లి కూన చేసిన అల్లరిని లెబనాన్ రాజధాని బీరుట్కు చెందిన ఓ విలేకరి షేర్ చేయగా.. సదరు వీడియో నెట్టింట్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఇంతకీ దానిలో ఏముందంటే.. లారిస్సా ఎవౌన్ అనే విలేకరి ఓ టీవీ ఛానెల్కు లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ పిల్లి పిల్ల ఆమె ధరించిన కోటుకు ఉన్న బెల్టుతో ఆడటం మొదలుపెట్టింది. ఈ విధంగా అది రెండు సార్లు అంతరాయం కలిగించింది.
ఆ పిల్లి కూన అల్లరిని ‘‘నా అత్యంత నమ్మకమైన ఫాలోవర్..’’ అనే క్యాప్షన్తో లారిస్సా షేర్ చేశారు. దాని సందడికి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఇదే పరిస్థితి మధ్యాహ్నం లైవ్ కార్యక్రమంలో కూడా కొనసాగిందంటూ ఆమె మరో వీడియోను షేర్చేశారు. అయితే ముద్దొచ్చే పిల్లిపిల్ల సరదా చేష్టల వల్ల అంతరాయం కంటే ఎక్కువగా వినోదమే లభించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ పిల్లి కూన సందడేంటో మీరూ చూసేయండి..
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్