కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా! 

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగేలా కంగన పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని అంధేరి.........

Published : 03 Nov 2020 21:58 IST

సుశాంత్‌ కేసులోకి లాగినందుకన్న ప్రముఖ గేయ రచయిత

ముంబయి : బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగేలా కంగన పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించిన ఆయన నటిపై దావా వేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంలో‌ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగనా ట్విటర్‌ వేదికగా పలుమార్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్‌ కేసులోకి అన్యాయంగా లాగినట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఈ దావా కేసుకు సంబంధించి డిసెంబరు 3న ధర్మాసనం వాదనలను విననుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని