మహేశ్‌ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్‌

జమ్ముకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్‌ రాడ్యా మహేశ్‌ (26)కు కేటీఆర్‌ ఘన నివాళి అర్పించారు...

Updated : 09 Nov 2020 19:19 IST

నిజమాబాద్‌: జమ్ముకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్‌ ర్యాడా మహేశ్‌ (26)కు కేటీఆర్‌ ఘన నివాళి అర్పించారు. మహేశ్‌ త్యాగం మరువలేనిదన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మహేశ్‌ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వీరజవాను మహేశ్‌ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటుందన్నారు. మరోవైపు మహేశ్ స్వగ్రామం స్వగ్రామంలో విషాదం అలముకుంది. నిజామాబాద్‌ జిల్లా సోమన్‌పల్లిలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు. 

సోకసంద్రంలో రెడ్డివారి పల్లె

ఇదే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో జవాన్‌ చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ స్వగ్రామంలోనూ విషాదం అలముకుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్‌ త్యాగాన్ని అందరూ కొనియాడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రవీణ్‌ గత 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పని చేస్తున్నారు. హవల్దార్‌గా పని చేస్తూ కమాండో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.  ప్రవీణ్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందడంతో తమకు దిక్కులేకుండా పోయిందని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రవీణ్‌ తండ్రి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు