మహేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
జమ్ముకశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన జవాన్ రాడ్యా మహేశ్ (26)కు కేటీఆర్ ఘన నివాళి అర్పించారు...
నిజమాబాద్: జమ్ముకశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన జవాన్ ర్యాడా మహేశ్ (26)కు కేటీఆర్ ఘన నివాళి అర్పించారు. మహేశ్ త్యాగం మరువలేనిదన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మహేశ్ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వీరజవాను మహేశ్ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటుందన్నారు. మరోవైపు మహేశ్ స్వగ్రామం స్వగ్రామంలో విషాదం అలముకుంది. నిజామాబాద్ జిల్లా సోమన్పల్లిలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు.
సోకసంద్రంలో రెడ్డివారి పల్లె
ఇదే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మరో జవాన్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ స్వగ్రామంలోనూ విషాదం అలముకుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్ త్యాగాన్ని అందరూ కొనియాడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రవీణ్ గత 18 సంవత్సరాలుగా మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పని చేస్తున్నారు. హవల్దార్గా పని చేస్తూ కమాండో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందడంతో తమకు దిక్కులేకుండా పోయిందని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రవీణ్ తండ్రి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ