హైదరాబాద్.. వ్యాక్సిన్లకు క్యాపిటల్: కేటీఆర్
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్కు లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ......
కేంద్ర ఆరోగ్య మంత్రికి కేటీఆర్ లేఖ
కీలక అంశాలు ప్రస్తావించిన మంత్రి
హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తయారీకి జరుగుతున్న ప్రయత్నాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్కు లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సిన్ అభివృద్ధికి జరుగుతున్న కృషిని వివరించారు. వ్యాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవసరమన్న కేటీఆర్.. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల విషయంలో మరింత వేగంగా కదలాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉందన్నారు. ఇక్కడి నుంచి ఏటా సుమారు 5 బిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తోందన్నారు.
త్వరలో వ్యాక్సిన్.. ఆశతో ఉన్నాం!
ఇప్పటికే నగరానికి చెందిన మూడు కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ ఇక్కడి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ఉన్నామనీ.. ఇది తమకెంతో గర్వకారణమని మంత్రి తెలిపారు. దీంతో పాటు అనేక ఇతర ఫార్మా కంపెనీలు సైతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందుల తయారీలో భాగస్వామ్యమయ్యాయని కేటీఆర్ తెలిపారు. గత వారం బయోటెక్ పరిశ్రమ వర్గాలతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని హర్షవర్దన్కు తెలిపారు. దేశీయంగా బయోటెక్ పరిశ్రమలను మరింత ఉన్నత స్థానాలకు తీసుకుపోయేందుకు ఉన్న అవకాశాలను, అందుకు తీసుకోవాల్సిన చర్యలను తన లేఖలో ప్రస్తావించారు.
వ్యాక్సిన్కు అనుమతుల్లో వికేంద్రీకరణ అవసరం
అలాగే, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను ప్రస్తావించారు. వ్యాక్సిన్కు అనుమతులు, టెస్టింగ్, ట్రాకింగ్ వ్యవస్థను మరింత వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్ , వ్యాక్సిన్ల తయారీ వంటి వాటిలో మరింత సులభంగా కంపెనీలు ముందుకు పోయే అవకాశం ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ సమకూర్చే విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ లాబోరేటరీ హిమాచల్ ప్రదేశ్లోని కసౌలిలో ఉందని, ఈ కేంద్రం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏర్పాటు చేసిందని ఇప్పటికీ అక్కడ కొనసాగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బయోటెక్ సంస్థలకు ఇబ్బందిగా మారిందన్నారు. గతంలో లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రయాణ సౌకర్యాలు సరిగా లేనందున సెంట్రల్ డ్రగ్ లాబోరేటరీకి శాంపిళ్లను పంపడంలో బయోటెక్ పరిశ్రమలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయనీ, ప్రస్తుతం మరింత వేగంగా వ్యాక్సిన్ తయారు చేసే ఉద్దేశంతో కంపెనీలు పని చేస్తున్న నేపథ్యంలో వారికి కొంత సులభంగా అనుమతులు ఇచ్చే ఈ విషయాన్ని పరిశీలించాలన్నారు. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.
ఆ సంస్థల్ని సంస్థల్ని బలోపేతం చేయాలి
ప్రపంచ బయోటెక్ రంగంలో భారత్ను మరింత అగ్ర స్థానంలో నిలిపి అక్కడి పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్ల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా వికేంద్రీకరణ కోసం కేంద్రం చర్యలు తీసుకొని CDSCO జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ జోనల్ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని మంత్రి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. తద్వారా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
పోటీని తట్టుకోవాలంటే..
భారతదేశంలో వ్యాక్సిన్ల తయారీకి సుమారుగా 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్.. ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ క్లిష్టతరమైన ప్రక్రియను కొంత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సులభతరం చేస్తూ కఠినమైన నిబంధనలతోనే సులభంగా, ఆలస్యం కాకుండా వ్యాక్సిన్లకు అనుమతి లభించే తీరుగా నూతన విధానాన్ని రూపకల్పన చేయాలని సూచించారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్కి సంబంధించి లైసెన్సింగ్ ప్రక్రియ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్డీఏఏ వంటి సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశాయని, ఈ గైడ్లైన్స్కి ప్రమాణాలకు అనుకూలంగా దేశీయంగా మార్గదర్శకాలను త్వరగా రూపొందించాలని తద్వారా వ్యాక్సిన్ తయారీలో కంపెనీలకు ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.
అందరికీ వ్యాక్సిన్ అందేలా..
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీ పైనా మంత్రి కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ దశలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యాక్సిన్ ట్రయల్స్కు సంబంధించి నూతన ఫ్రేమ్ వర్క్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పాటు కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి పెట్టుకొని విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసే విధంగా అవకాశం ఇవ్వాలని కోరారు. తద్వారా విజయవంతమైన వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని మంత్రి సూచించారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడుతున్న నేపథ్యంలో వాక్సిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని సైతం ప్రభుత్వం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని తద్వారా వ్యాక్సిన్ కొందరికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఎం కేర్స్ నిధి ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలను వ్యాక్సిన్ తయారీ చేస్తున్న కంపెనీల కోసం కేటాయించిన నేపథ్యంలో వాటిని వారికి అందించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని దీంతోపాటు వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్ ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తద్వారా వేగంగా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుందని, ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కేటీఆర్ కోరారు
సరైన నిర్ణయాలు తీసుకుంటేనే..
ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రంగంలో భారత్ లీడర్ స్థానంలో ఉందని ఇలాంటి సంక్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు వేగంగా తీసుకోకుంటే ఆ స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు పరిశ్రమ వర్గాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమకు లేదా కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ హర్షవర్దన్కు రాసిన లేఖలో స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు