‘బాబా కా ధాబా’ టు ‘రెస్టారంట్ కా బాబా’!
‘బాబా కా ధాబా’ ఇటీవల దిల్లీ సహా సామాజిక మాధ్యమాల్లో దేశమంతటా బాగా ప్రఖ్యాతి గాంచిన పేరు అది. ఆ ధాబాకు చెందిన వృద్ధ దంపతులు ప్రస్తుతం ఓ రెస్టరెంట్కు యజమానులు కావడం విశేషం.
దిల్లీ: ‘బాబా కా ధాబా’ ఇటీవల దిల్లీ సహా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రఖ్యాతి గాంచిన పేరు. ఆ ధాబాకు చెందిన వృద్ధ దంపతులు ప్రస్తుతం ఓ రెస్టారంట్కు యజమానులు కావడం విశేషం. నెటిజన్లు చేసిన విరాళాల సాయంతో ప్రస్తుతం కాంత ప్రసాద్(80) దంపతులు ఓ హోటల్కు యజమానులయ్యారు. తాజాగా దిల్లీలోని మాలవీయ నగర్లో వారు నూతన రెస్టారంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతప్రసాద్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మాకు సహాయం చేసిన ప్రజలకు మేం రుణపడి ఉంటాం. మా హోటల్కు రావాలని ప్రజల్ని కోరుతున్నాం. ఇక్కడ దేశీ ఆహారంతో పాటు చైనీస్ ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి’ అని తెలిపారు.
‘బాబా కా ధాబా’ పేరుతో దిల్లీకి చెందిన వృద్ధ దంపతుల కష్టాలపై గౌరవ్ వసన్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన కష్టాలపై ఆ వీడియోలో కాంత ప్రసాద్ ఏడ్చిన తీరు అందరినీ కలచి వేసింది. దీంతో ఎంతో మంది నెటిజన్లు విరాళాల రూపంలో ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన విరాళాలతో తన కష్టాలు తీరిపోతాయని కాంత ప్రసాద్ భావిస్తుండగా.. మరో వివాదం తెరమీదకు వచ్చింది. తన పేరుపై వచ్చిన విరాళాల్ని ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు బెదిరించిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
ఇదీ చదవండి
‘దిగులు పడొద్దు బాబా.. మేమున్నాం’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM