పోలవరంపై హైదరాబాద్‌లో కీలక భేటీ

పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన ఎజెండాగా సోమవారం హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్టు

Updated : 02 Nov 2020 11:29 IST

హైదరాబాద్‌: పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన కేంద్ర జలసంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా ధరల ప్రకారం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలు, ఇవే అంశాలను అథారిటీ సమావేశంలోనూ ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ షరతులు పెడుతున్న సమయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కొర్రీని యథాతథంగా ఆమోదించి పంపుతారా? చర్చల తర్వాత అప్పటి అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించడం కష్టమని తేలుస్తారా? అన్నది చూడాలి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌నుంచి హాజరవుతున్న అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ మార్గదర్శకాలు, దేశంలోని ఇలాంటి 16 ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? తదితర అంశాలను ప్రస్తావించేలా సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు? పోలవరం అథారిటీ ఏ ఉద్దేశంతో ఏర్పడింది? 2013 భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం పోలవరంపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ దశలో చాలినంత నిధులివ్వకపోతే భవిష్యత్తేమిటి? తదితర అంశాలతో వాదనను వినిపించేందుకు ఏపీ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని