గుడ్డులాంటిదే మనిషి తల.. కాపాడుకోవాలి మరి!
ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కొంత మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకుండా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేదుకు ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ లేకుండా..
ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న అవగాహన
మలక్పేట: ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కొంత మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకుండా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లు హెల్మెట్ లేకుండా రహదారిపైకి వచ్చిన ద్విచక్రవాహనదారులకు ఒక్కొక్కరికి ఒక్కో కోడిగుడ్డు చేతిలో పెట్టారు. ఈ కోడిగుడ్డు లాంటిదే మనిషి తల అని.. ఒకసారి ప్రమాదానికి గురైతే ప్రాణాలు పోవడమే కానీ తిరిగి మామూలుగా అవడమంటూ ఉండదని చెబుతూ అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ద్విచక్రవాహన ప్రమాదాల్లో అత్యధిక శాతం తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కోడి గుడ్డులాగే మన తల కూడా చాలా సున్నితమైనది. ఎన్నిసార్లు చెప్పినా కొంత మంది ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది వారి ఆప్తులను కోల్పోతున్నారు. బయటకు వచ్చాక ఇంటి దగ్గర మన కోసం ఓ కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి