రూ.72 లక్షల విలువైన మద్యం ధ్వంసం

అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు మచిలీపట్నంలో ఆ సీసాలను రోడ్‌ రోలర్‌ సహాయంతో ధ్వంసం చేశారు.

Published : 17 Jul 2020 18:54 IST

మచిలీపట్నం‌: అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు మచిలీపట్నంలో ఆ సీసాలను రోడ్‌ రోలర్‌ సహాయంతో ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సీసాలను రోడ్‌ రోలర్‌తో తొక్కించారు. సుమారు రూ.72 లక్షల విలువ చేసే 14 వేల సీసాలను ధ్వంసం చేశారు. లాక్‌డౌన్‌ కాలం నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పది పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని