శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు.
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. శనివారం సాయంత్రం 6.03 గంటల నుంచి 6.30గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం అనంతరం వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపు రాత్రి 8.30గంటల నుంచి 9.30గంటల వరకు పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. కరోనావల్ల ఈసారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంకురార్పణ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. మరోవైపు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీవారి ఆలయం, తిరుమల ప్రవేశ మార్గాలు, కూడళ్లలో అలంకరణలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా