తక్కువ రిస్క్ ఉన్న డెట్ పథకాలు
భద్రత, లిక్విడిటీ, కాలపరిమితి, క్రమమైన ఆదాయం , పన్ను ప్రయోజనాలను చూసుకొని పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి....
భద్రత, లిక్విడిటీ, కాలపరిమితి, క్రమమైన ఆదాయం , పన్ను ప్రయోజనాలను చూసుకొని పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి
సాధారణంగా ప్రభుత్వం జారీ చేసే డెట్ పథకాలు లేదా సంబంధిత సంస్థలు తక్కువ రిస్క్ను కలిగి ఉటాయి. ఇలాంటి పరిస్థితిలో, అవి సురక్షితమైన పెట్టుబడి సాధనాలు. వాటిలో కొన్నింటిని చూద్దాం.
భారత్ బాండ్ ఫండ్ ఆఫ్ ఫండ్:
ఈ ఆప్షన్ పీఎస్యూ బాండ్లలో AAA- రేటింగ్ కలిగి ఉంది. ఇది పెట్టుబడి ఎంపిక చాలా సురక్షితం. ఇది నిఫ్టీ భారత్ బాండ్ సూచికను అనుసరిస్తుంది. తక్కువ ఛార్జీలతో కూడిన పాసివ్ ఫండ్. మూడేళ్ల, పదేళ్ల ఆప్షన్ ఎంచుకోవచ్చు. పదేళ్ల ఆప్షన్ ఎంచుకుంటే ఇండెక్సేషన్తో దీర్ఘకాలిక మూలధన లాభాల ప్రయోజనాన్ని అందిస్తుంది. పన్ను-అనంతర రాబడి ఇతర డెట్ పెట్టుబడి ఎంపికల కంటే మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఇందులో పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కూడా లిక్విడ్గా ఉంటుంది, ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు.
ప్రతికూలతలు ఏమిటంటే, మీకు ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు కొనసాగించాలనుకుంటేనే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. స్వల్పకాలికంగా అస్థిరతకు ఎదురుకావొచ్చు. దీంతోపాటు ఇది క్రమమైన ఆదాయన్ని అందించదన్న విషయం గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వ సెక్యూరిటీలు:
ఇవి ప్రభుత్వ సెక్యూరిటీలను అంతర్లీన సాధనంగా కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్ పథకాలు. ఈ అంశం కారణంగా, అవి వాస్తవంగా ప్రమాద రహితంగా ఉంటాయి. ఇవి యాక్టివ్గా నిర్వహించే ఫండ్లు, మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. ఇటువంటి పథకాలకు సుదీర్ఘ పదవీకాలం ఉంటుంది, అందువల్ల ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండటానికి అనువైనది. లిక్విడిటీ సమస్య కాదు ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఈ పథకం నుంచి నగదు పొందవచ్చు
భారత్ బాండ్ ఎఫ్ఓఎఫ్తో పోలిస్తే ఈ ఫండ్లలో ఖర్చులు ఎక్కువ. ఈ నిధులు కూడా స్వల్పకాలికంలో అధిక అస్థిరతకు లోనవుతాయి కానీ కాలానుగుణంగా సర్దుకుంటాయి. దీంతోపాటు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కూడిన ఎల్టిసిజిని పొందవచ్చు, దీని కారణంగా పన్ను అనంతర రాబడి చాలా డెట్ ఫండ్ల కంటే మెరుగ్గా ఉంటుంది.
బ్యాంకింగ్, పీఎస్యూ డెట్ ఫండ్లు :
ఇవి డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. వీటిలో అంతర్లీనంగా బ్యాంకింగ్ లేదా పిఎస్యు డెట్ పేపర్లు ఉంటాయి. అందువలన, వారు సురక్షిత పెట్టుబడులుగా చెప్పవచ్చు.
ఈ పెట్టుబడిలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే ఇవి మూడేళ్ల లోపు తక్కువ కాలపరిమితి కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధిలో తమ డబ్బును పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అనుకూలంగా ఉంటాయి. వడ్డీ రేటులో అస్థిరత తక్కువగా ఉంటుంది.
ఇందులో లిక్విడిటీ సమస్య లేదు కానీ, కొంత ఎక్కువ ఖర్చుతో కూడిన చురుకుగా పనిచేసే ఫండ్లుగా చెప్పవచ్చు.
ఇతర డెట్ మ్యూచువల్ ఫండ్లు:
డెట్ మ్యూచువల్ ఫండ్లలో వివిధ రకాలు ఉన్నాయి. కార్పొరేట్ బాండ్, షార్ట్-టర్మ్, మీడియం, లాంగ్-టర్మ్ ఫండ్లు వంటివి. ఎక్కువ నాణ్యత కలిగిని ఫండ్లు. ఇతర ఎఫ్డ్, ఎన్సీడీ, బాండ్లతో పోలిస్తే డెట్ ఫండ్లలో వేర్వేరు పెట్టుబడులు ఉంటాయి కాబట్టి ఇవి సురక్షిత పెట్టుబడులు. అనిశ్చితి ఏర్పడినప్పటికీ బ్యాలెన్స్ అవుతుంది. ఇక లిక్విడిటీ సమస్య లేదు, స్వల్పకాలిక పరిమితి, పన్ను ప్రయోజనం పొందవచ్చు. వైవిధ్యత కారణంగా రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు కాబట్టి భయంలేదు.
ఆర్థిక వ్యవస్థలో పరిస్థితి మరింత దిగజారితే, ఇంతకుముందు చర్చించిన ఇతర మూడు మార్గాలకు మారవచ్చు.
పీఎస్యూ బాండ్లు:
పీఎస్యూ బాండ్లు పన్ను రహితం, సంవత్సరం వారిగా క్రమమైన ఆదాయం పొందవచ్చు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. డబ్బు లాక్ అయిపోతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు అవసరం లేకపోతే ఇది ఎంచుకోవచ్చు. పన్ను తర్వాత రాబడి 5.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్ల కంటే మంచి రాబడినిస్తున్నాయి.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు:
ఇది అందరికి సాధారణంగా తెలిసిందే. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడం సురక్షితం. లిక్విడిటీ లభిస్తుంది. కానీ రాబడి తక్కువగా ఉంటుంది. క్రమంగా ఆదాయం కూడా పొందవచ్చు. వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.
చిన్న పొదుపు పథకాలు:
టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్సీ, కేవైపీ వంటి చిన్న పొదుపు పథకాలు సురక్షితమైనవి. అయితే పన్ను తర్వాత రాబడి తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ ( కాలపరిమితి టర్మ్ డిపాజిట్లు మినహాయించి) తక్కువగా ఉంటుంది. ఎన్ఎస్సీ, కేవీపీ క్రమమైన ఆదాయాన్ని ఇవ్వవు. అయితే ఇవి సులభమైన, భద్రతతో కూడిన పెట్టుబడులుగా చెప్పవచ్చు.
ఆర్బీఐ బాండ్లు:
ఆర్బీఐ బాండ్లపై వడ్డీ 7.75 శాతం. పన్ను వర్తిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు సురక్షితం అని నిపుణులు చెప్తున్నారు. వడ్డీ ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. ఏడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇంత కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇది ఎంచుకోవచ్చు.
భద్రత, లిక్విడిటీ, కాలపరిమితి, క్రమమైన ఆదాయం , పన్ను ప్రయోజనాలను చూసుకొని పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. మారుతున్న పరిస్థితులను అంచనా వేసి పెట్టుబడులను కొనసాగించాలి. పెట్టుబడుల భద్రత చాలా ముఖ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం