తప్పిపోయిన పోలీసు.. దీనావస్థలో
అది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణం. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వెళుతున్నారు. అయితే దీనావస్థలో ఉన్న ఓ వ్యక్తి చలిలో వణుకుతూ...
15 ఏళ్ల కిందటి అధికారుల పేర్లు చెప్పడంతో గుర్తింపు
గ్వాలియర్: అది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణం. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వెళుతున్నారు. అయితే దీనావస్థలో ఉన్న ఓ వ్యక్తి చలిలో వణుకుతూ ఫుట్పాత్ వెంట ఆహారం కోసం వెతుకుతుండటాన్ని వారు గమనించారు. చలించిన అధికారులు అతడి వద్దకు వెళ్లి ఓ జాకెట్ను అందించగా సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పడంతో వారు కంగుతిన్నారు. అయితే అతడు 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ సహచర అధికారే అని తెలిసి ఆశ్చర్యపోయారు.
డిప్యూటీ సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న రత్నేష్సింగ్ తోమర్, విజయ్సింగ్ బహదూర్ గ్వాలియర్లో మంగళవారం రాత్రి ఓ వివాహానికి వెళుతుండగా వారికి ఈ ఆశ్చర్యకర ఘటన ఎదురైంది. యాచకుడిలా కనిపించిన సదరు వ్యక్తిని నిశితంగా పరిశీలించిన అధికారులు అతడిని తమ సహచరుడు మనీశ్ మిశ్రాగా గుర్తించారు. గ్వాలియర్ క్రైం బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న రత్నేష్సింగ్ తోమర్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మనీశ్ మిశ్రా మానసిక సమస్యలతో బాధపడేవాడని, 2005లో దతియాలో ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వచ్చిన అనంతరం ఆయన కనిపించకుండా పోయాడని తోమర్ పేర్కొన్నారు. ఈ 15 ఏళ్లలో మనీశ్ జాడ తెలియరాలేదన్నారు.
మనీశ్ని ప్రస్తుతం ఓ ఎన్జీఓ ఆశ్రమంలో చేర్పించామని తెలిపారు. ‘మిశ్రా మాతోపాటే 1999లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. అతడో మంచి అథ్లెట్. షార్ప్ షూటర్. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలం తర్వాత మానసిక సమస్యలతో బాధపడ్డాడు. అతడి కుటుంబం వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు’ అని తోమర్ వివరించారు. అతడికి ఉత్తమ వైద్యం అందించి తిరిగి మామూలు మనిషిగా మార్చేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
Swarnamukhi River: తుపాను ఎఫెక్ట్.. ‘స్వర్ణముఖి’లోకి భారీగా వరద
మిగ్జాం (Cyclone Michaung) తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. -
kazipet-vijayawada : కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
మిగ్జాం తుపాను నేపథ్యంలో అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు. -
నోటా.. మాట వినలేదు..!
పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)కు ఓటు వేయొచ్చు. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటా మాట చాలా మంది వినలేదు. -
కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి
కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్ రాందాస్నాయక్ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం
-
Job Interview: ‘ఇంటర్వ్యూలో ఇవి చేయొద్దు..’ గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన సీక్రెట్లు
-
Mizoram Election Results: మిజోరంలో ZPM జయకేతనం.. సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి
-
BRS: తెలంగాణ భవన్లో భారాస ముఖ్యనేతల భేటీ
-
Allu Aravind: అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: అల్లు అరవింద్
-
Volcano: ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది పర్వతారోహకుల మృతి