వైకాపా ఎంపీకి కరోనా పాజిటివ్‌

వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని కార్యక్రమాల సందర్భంగా కడప జిల్లాలో వచ్చేనెల 1, 2 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

Published : 30 Aug 2020 16:14 IST

కడప: వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని కార్యక్రమాల సందర్భంగా కడప జిల్లాలో వచ్చేనెల 1, 2 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా ఎంపీ అవినాష్‌ రెడ్డికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. తనకు కరోనా నిర్ధారణ కావడంతో ఎంపీ వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అయితే కొద్దిరోజులగా వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరైన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. వీరిలో అధికార వైకాపాతో పాటు తెదేపా నేతలు కూడా ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని