చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు

తెదేపా అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరికి మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు.

Published : 02 Sep 2020 01:54 IST

మదనపల్లి (నేర విభాగం): తెదేపా అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరికి మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. వైకాపా నేతల వేధింపుల కారణంగానే ఓంప్రతాప్‌(30) అనే యువకుడు మృతిచెందినట్లు ఇటీవల చంద్రబాబుతో పాటు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేశ్‌, వర్ల రామయ్యకు నోటీసులు పంపినట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. విచారణ భాగంగా ఏమైనా ఆధారాలు ఉంటే వారంలోపు నేరుగా లేదా తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అందజేసి దర్యాప్తునకు సహకరించాలని వారిని కోరినట్లు డీఎస్పీ చెప్పారు. 

చిత్తూరు జిల్లా సోమల మండలంలో గత నెల 24న ఓం ప్రతాప్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ యువకుడు మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడం.. ఆ తర్వాత మృతిచెందడం పలు ఆరోపణలకు దారి తీసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఓం ప్రతాప్‌ మృతిపై సోమల మండల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణాధికారిగా డీఎస్పీ మనోహరాచారిని నియమించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌, వర్ల రామయ్యకు డీఎస్పీ నోటీసులు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని