మరో ఐదు లక్షల యువతకు శిక్షణ: మహీంద్రా
వచ్చే ఐదేళ్లలో మరో 5లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్ సిద్దమవుతోందని వారు గురువారం ప్రకటించారు.
ముంబయి: వచ్చే ఐదేళ్లలో మరో ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్ సిద్దమవుతోందని వారు గురువారం ప్రకటించారు. గత పదిహేనేళ్లలో ‘మహీంద్రా ప్రైడ్ స్కూల్స్’(ఎమ్పీఎస్), తరగతులతో ఇప్పటికే ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల్లోని ప్రతిభావంతులను వెలికితీసే లక్ష్యంతో మహీంద్రా ప్రైడ్ స్కూల్స్ ప్రారంభించారు. ‘‘గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’’ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)లో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం 2005లో మహీంద్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్పీఎస్ కేంద్రాలు చెన్నై, పూణె, చండీగఢ్, హైదరాబాద్, శ్రీనగర్, పాట్నా , వారణాసిల్లో ఉన్నాయి. వారు విడుదల చేసిన ప్రకటలోని వివరాల ప్రకారం.. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు మహీంద్రా గ్రూప్ నాంది ఫౌండేషన్ సహకారంతో కొవిడ్-19 తర్వాతి కాలానికి కావల్సిన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, ఈ-కామర్స్ వంటి వాటికి శిక్షణ కార్యక్రమాలను విస్తరిస్తున్నామన్నారు. రాబోయే ఏళ్లలో ఉద్యోగ కల్పనలో వేగాన్ని పెంచుతామని వారు తెలిపారు. నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్కుమార్ మాట్లాడుతూ.. మన దేశంలో తగినంత జనాభా ఉన్నా, వారి ఆర్థిక పరిస్థితులననుసరించి ఉద్యోగాల కోసం వెళ్లట్లేదన్నారు. ఎంపీఎస్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించామన్నారు. దీని ద్వారా వారికి సురక్షితమైన ఆదాయమార్గం కల్పించడమే ధ్యేయమని తెలిపారు.
ఇదీ చదవండి..
జనవరి 1 నుంచి వాహనధరల పెంపు: మహీంద్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM