పుర్రెలా కనిపించాలని చెవులు కత్తిరించుకున్నాడు
శరీరం మొత్తం టాటూలు వేసుకోవడం.. విభిన్నంగా ఉండాలనో.. మరింత అందంగా కనిపించాలనో శరీరంలోని అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం విదేశాల్లో సర్వసాధారణమే కానీ.. పైన కనిపిస్తున్న వ్యక్తి చేసిన పని మాత్రం ఎవరూ చేయలేరు.. చేయడానికి
ఇంటర్నెట్ డెస్క్: శరీరం మొత్తం టాటూలు వేసుకోవడం.. విభిన్నంగా ఉండాలనో.. మరింత అందంగా కనిపించాలనో అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం విదేశాల్లో సర్వసాధారణమే కానీ.. పైన కనిపిస్తున్న వ్యక్తి చేసిన పని మాత్రం ఎవరూ చేయలేరు.. చేయడానికి సహసించరనే చెప్పాలి. ఏం చేశాడంటారా..! తన ముఖం పుర్రెలా కనిపించాలని ఏకంగా తన చెవులను తొలగించుకున్నాడు మరి.
టాటూలు వేయించుకోవడం.. సర్జరీలకు చేయించుకోవడం వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొందరు నమ్ముతారు. అలాంటి వ్యక్తే జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో. గత కొన్నాళ్లుగా సాండ్రో తన శరీరంపై అనేక చోట్ల టాటూలు వేయించుకున్నాడు. అయితే కొన్నాళ్ల కిందట అతడి ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలనుకున్నాడట. ఈ క్రమంలో చెంపలపై పుర్రె దవడల్లా టాటూలు వేయించుకున్నాడు. కరోనా రాకముందు రూ. 5లక్షల వరకు ఖర్చు చేసి తన రెండు చెవులను తొలగించుకున్నాడు. వాటిని ఓ జార్లో భద్రపర్చి ఇంట్లో పెట్టుకున్నాడు.
ప్రస్తుతం చెవులు లేకుండా సాండ్రో ముఖం కాస్త భయంకరంగా ఉన్నా.. సోషల్మీడియాలో అతడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు తనని విచిత్ర వ్యాధితో బాధపడుతున్న వాడిలా భావిస్తున్నా అవన్నీ పట్టించుకోనని అంటున్నాడు. తన ముఖాన్ని చూస్తే తనకు ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉంటుందని, మరో శస్త్రచికిత్స చేయించుకొని ముక్కును కూడా తొలగించుకుంటానని వెల్లడించాడు. పుర్రెలా కనిపించడం కోసం ఏదైనా చేస్తానని అంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి