విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స
పాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖ: పాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని చెప్పారు.
ప్రైవేటు భాగస్వామ్యమా? నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా? అనే విషయంపై సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)