ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కేటీఆర్‌

కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని.. పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల ఆస్తులపై

Updated : 28 Sep 2020 21:21 IST

హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని.. పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల ఆస్తులపై వారికి శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై చర్చించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా సమాయత్తం చేయాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వభూముల్లో దశాబ్దాల తరబడి నివాసముంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా ఉపశమనం కల్పించామన్నారు. 

ఆ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం..

పట్టణాల్లో పేదలకు శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని చూపే కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్‌ కోరారు. పట్టణాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సంబంధిత సమస్యలను సేకరించి ఇవ్వాలని వారికి సూచించారు. ఆయా కాలనీల్లోని భూ సంబంధిత సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సంఖ్య.. వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని