21 అంబులెన్సు లను ప్రారంభించిన కేటీఆర్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది.
హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 21 అంబులెన్సులను ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మూడు చొప్పున; మంత్రి నిరంజన్ రెడ్డి ఒకటి; ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రెండు; చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరు రమేశ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వరంగల్కు చెందిన లక్ష్మణరావు ఒక్కో అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు. ఈ అంబులెన్సులను ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు వినియోగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్