రాష్ట్రాభివృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు,
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు, ప్రదర్శనను గురువారం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నేటి నుంచి నవంబర్ 24 వరకు 90 రోజుల పాటు ఈ వర్చువల్ ప్రదర్శన జరగనుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు రెండురోజుల పాటు జరగనుండగా.. ఇవాళ్టి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ బిజినెస్ ఎకోసిస్టం, వనరులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతల ప్రదర్శనకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో డిజిటలైజేషన్ పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టిందని.. ఆ అవకాశాలను తెలంగాణ రాష్ట్రం వేగంగా అందిపుచ్చుకుంటోందని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్