పొగాకు ఉత్పత్తులకు కళ్లెం వేద్దాం!
పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులకు కేంద్రం ప్రవర్తనా నియమావళి రూపొందించింది. పొగాకు పరిశ్రమలు తమ అధికారంతో ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడంతో పాటు.........
అధికారులకు కేంద్రం సూచనలు
హైదరాబాద్: పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులకు కేంద్రం ప్రవర్తనా నియమావళి రూపొందించింది. పొగాకు పరిశ్రమలు తమ అధికారంతో ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తీసుకొనే చర్యలకు ఆటంకాలు కలిగిస్తుంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు సహకరించకుండా కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది. డబ్ల్యూహెచ్వో పొగాకు నియంత్రణ ఆర్టికల్ 5.3కి అనుగుణంగా ఈ పరిశ్రమల వాణిజ్య ప్రయోజనాల నుంచి ప్రజారోగ్య విధానాలను పరిరక్షించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక పొగాకు వినియోగదారులున్న మన దేశంలో దీని నియంత్రణకు ఎన్నో చట్టాలు రూపొందించినా.. వాటిలో కొన్ని మాత్రమే సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొంది. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లాల స్థాయిలో పొగాకు పరిశ్రమ ప్రవేశాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు పరిశ్రమలతో పరస్పర చర్యలను పరిమితం చేసేలా ఏర్పాట్లు చేయాలని సిఫారసు చేసింది.
జాతీయ చట్టానికి అనుగుణంగా పొగాకు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు ఆయా పరిశ్రమల వాణిజ్య, ఇతర స్వార్థ ప్రయోజనాల నుంచి రక్షించడానికి దోహదపడతాయని కేంద్రం సూచించింది. పొగాకు పరిశ్రమల ఉత్పత్తులను నియంత్రించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాలని, అవసరమైనంత వరకు మాత్రమే పొగాకు ఉత్పత్తులు ఉండేలా చూడాలని తెలిపింది. ఆరోగ్య విధానంలో పొగాకు పరిశ్రమ జోక్యాన్ని తొలగించడం ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత ప్రభావవంతమైన చర్య.. దీనిద్వారా ధూమపానం వల్ల సంభవించే మరణాలు, వ్యాధులను నివారించవచ్చంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) కొన్ని ప్రాంతాల్లో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఇంకా దాంట్లో అనేక అంశాలను సవరించాల్సి ఉందని అభిప్రాయపడింది. దీనిద్వారా పొగాకు వాడకంతో ముప్పు నుంచి దేశ జనాభాను మరింత సమర్థంగా కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం