నూతన విద్యా విధానంతో విశ్వగురువుగా భారత్
దిల్లీ: భారత్లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారత్ను విశ్వగురువుగా నిలుపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్ఐటీ అగర్తలలో మంగళవారం జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వర్చువల్ విధానంలో హాజరై ప్రసంగించారు.
ఎన్ఐటీ అగర్తల స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి
దిల్లీ: భారత్లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారత్ను విశ్వగురువుగా నిలుపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్ఐటీ అగర్తలలో మంగళవారం జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వర్చువల్ విధానంలో హాజరై ప్రసంగించారు. ఈ నూతన విద్యా విధానం క్రమశిక్షణతో కూడిన పూర్తిస్థాయి విద్యను, విలువలను అందిస్తుందన్నారు. ‘‘ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు జ్ఞానార్జనకు కేంద్రాలుగా ఉండాలి. విద్యార్థులు, పరిశోధకులు నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. విద్యా బోధనలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి. మనం నేర్చుకున్న దానిని ఎప్పుడైతే జీవితాల్లో అనుసరిస్తామో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ ఔన్నత్యాన్ని తెలిపేలా విద్యార్థులంతా వసుధైక కుటుంబంలా ఉండాలన్నారు. పంచుకోవడంలోనే సంతోషం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకటించిన వంద ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో స్థానం సాధించినందుకు ఎన్ఐటీ అగర్తలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం