మద్యం సీసాల అంశం..వరలక్ష్మి రాజీనామా
కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా...
విజయవాడ: కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్ మద్యం బాటిళ్లు తరలించినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్ కూడా ఇప్పటికే తన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఉదయభానుతోపాటు దేవాదాయశాఖ మంత్రికి కూడా తెలియజేశానన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాను ధర్మకర్తల మండలి సభ్యురాలిగా రాజీనామా చేస్తున్నట్లు నాగ వరలక్ష్మి తన లేఖలో స్పష్టం చేశారు.
పాలక మండలి సభ్యురాలు నాగవరలక్ష్మి వాహనంలో తెలంగాణ మద్యం లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. వైకాపా కార్యకర్త అయిన ఆమె భర్త వెంకట కృష్ణప్రసాద్, కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని ప్రసాద్ వాహనంపై బోర్డు తగిలించి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం ధరలు భారీగా పెరిగిన తర్వాత తెలంగాణ సరకు విచ్చలవిడిగా వస్తోంది. పలువురు దీన్నే వ్యాపారంగా చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో మండలానికొక నాయకుడు మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. వారు మినహా ఇతరులు మద్యం రవాణా చేస్తే పోలీసులకు సమాచారం వెళుతుందని ప్రచారం వైకాపాలోనే ఉంది. దుర్గగుడిలో ఇటీవల వెండి సింహాల చోరీ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ఈ వివాదం తెరమీదకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్