రూ.50 లక్షల వజ్రం లభ్యం
మధ్యప్రదేశ్లోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. పన్నా జిల్లాలో 10.69 క్యారెట్ల వజ్రం..
పన్నా: మధ్యప్రదేశ్లోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. పన్నా జిల్లాలో 10.69 క్యారెట్ల వజ్రం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుష్వాహా (35) 10.69 క్యారెట్ల వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమచేసినట్లు పన్నా వజ్రాల అధికారి ఆర్.కె.పాండే తెలిపారు. ఈ విలువైన రాయిని వేలం వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తరువాత ఆదాయాన్ని డిపాజిటర్కు ఇస్తామని స్పష్టం చేశారు. వజ్రం విలువను తేల్చాల్సి ఉంది. దాని నాణ్యత ఆధారంగా రూ.50 లక్షల విలువ చేస్తుందని స్థానిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఆనందిలాల్ ఇటీవలే 70 సెంట్ల వజ్రాన్ని కూడా కార్యాలయంలో జమ చేశారు. కరోనా లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇక్కడ లభ్యమైన మొదటి పెద్ద వజ్రం అని కుష్వాహా అన్నారు. తనతోపాటు తన భాగస్వామి ఆరు నెలలుగా గనిలో చాలా కష్టపడుతున్నామని, ఈ వజ్రం లభించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యామని విలేకరులతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల నిల్వలకు ప్రసిద్ధి చెందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM