మా దేశానికి వ్యాక్సిన్లు అందించండి
తమ దేశ జనాభాలో 20శాతం మందికి వ్యాక్సిన్లు సమకూర్చాలని నేపాల్ భారత్ను కోరింది. కరోనా వైరస్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ తమ దేశానికి వ్యాక్సిన్లను సేకరించే ప్రక్రియను తీవ్రం చేసింది.
భారత్ను కోరిన నేపాల్
కాఠ్మాండూ: తమ దేశ జనాభాలో 20శాతం మందికి వ్యాక్సిన్లు సమకూర్చాలని నేపాల్ భారత్ను కోరింది. కరోనా వైరస్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ తమ దేశానికి వ్యాక్సిన్లను సేకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రభుత్వం భారత్కు ఓ లేఖ రాసింది. భారత్లో ఇప్పటికే ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరిదశ ప్రయోగ పరీక్షల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ను తయారు చేస్తున్న ఇతర దేశాలకు కూడా నేపాల్ తన అభ్యర్థనను పంపింది. ఈ మేరకు నేపాల్ కొవిడ్-19 వ్యాక్సిన్ సలహా కమిటీ సమన్వయకర్త డాక్టర్ శ్యామ్రాజ్ ఉప్రేతి తెలిపారు. గత నెలలో నేపాల్ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ నేపాల్ ప్రజలకు వ్యాక్సిన్ అందజేయటంపై సంసిద్ధత వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో జరిగే కొవాక్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అన్ని దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఇతర దేశాల్లో తయారైన వ్యాక్సిన్లను అనుమతించేందుకు చట్టాల్లో మార్పులకు ఆర్డినెన్సును ఆమోదించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాని వినియోగంపై ఇప్పటికే ప్రాధాన్యతా క్రమాల్ని నేపాల్ రూపొందించింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం