అంత్యక్రియలకు హాజరైన 9 మందికి కరోనా

కామారెడ్డి పట్టణంలోని పంచముఖ హనుమాన్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈ నెల 7న భర్త మృతి చెందగా.. ఇవాళ భార్య ప్రాణాలు కోల్పోయింది.

Published : 13 Aug 2020 23:04 IST

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని పంచముఖ హనుమాన్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈ నెల 7న భర్త మృతి చెందగా.. ఇవాళ భార్య ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 9 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని