ఆ కోతి ఆచూకీ చెప్తే రూ.50 వేలు!
సాధారణంగా కావాల్సిన వారెవరో కనిపించకుండా పోతే ఆచూకీ తెలిపిన వారికి రివార్డు లిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం చూసుంటాం. కానీ, ఓ కోతి ఆచూకీ చెప్తే డబ్బులిస్తామనటం ఎప్పుడైనా చూశారా? అదీ తక్కువేం కాదు..అక్షరాల రూ.50 వేలు. ఈ వ్యవహారం పంజాబ్లోని ఛండీగఢ్ ప్రాంతంలో జరిగింది. మరి ఆ కోతికి అంత క్రేజ్ ఎందుకొచ్చిందో తెలుసా?..
ఛండీగఢ్: సాధారణంగా కావాల్సిన వారెవరో కనిపించకుండా పోతే ఆచూకీ తెలిపిన వారికి రివార్డు లిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం చూసుంటాం. కానీ, ఓ కోతి ఆచూకీ చెప్తే డబ్బులిస్తామనటం ఎప్పుడైనా చూశారా? అదీ తక్కువేం కాదు..అక్షరాల రూ.50 వేలు. ఈ వ్యవహారం పంజాబ్లోని చండీగఢ్ ప్రాంతంలో జరిగింది. మరి ఆ కోతికి అంత క్రేజ్ ఎందుకొచ్చిందో తెలుసా?
చండీగఢ్కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్ కమల్జీత్ సింగ్, ఆయన మేనేజర్ దీపక్ ఓహ్రా ఓ కోతిని పెంచుకునే వాళ్లు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను అక్రమంగా పెంచుకోవడం నేరం. దీంతో వారిద్దరినీ గత ఆగస్టు 19 పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత రోజే బెయిల్పై విడుదలయ్యారు. కోతిని పెంచుకోవడం వాస్తవమేనని అయితే అది చట్ట రీత్యా నేరమని తెలిసిన తర్వాత అడవిలో విడిచి పెట్టేశామని పోలీసులకు విచారణ సమయంలో చెప్పారు. అయితే వారు చెప్పేది నమ్మశక్యంగా లేదని ‘పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పీఈటీఏ) అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లవ్జీందర్ కౌర్ సరైన ఆధారలతో నిరూపించాలని నిందితులకు సూచిస్తూ కేసును అక్టోబర్ 7కి వాయిదా వేశారు.
మరోవైపు విచారణ సమయంలో నిందితుల మాటల్లో స్పష్టత కొరవడిందని అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అబ్దుల్ ఖయ్యూం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోతిని అడవిలో విడిచిపెట్టినట్లు వారు కచ్చితమైన ఆధారాలేవీ సమర్పించలేకపోయారన్నారు. అంతేకుండా కోతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఫిర్యాదు చేసిన ఎన్జీవో సంస్థ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. దాని ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ప్రకటించింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పింది. దీనిపై కమల్జీత్ సింగ్, దీపక్ వోహ్రా స్పందించారు ఈ ఘటనను ఎక్కువ చేసి చూపించేందుకు సదరు స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా