17న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-50
కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎంఎస్-01ను పీఎస్ఎల్వీ-సీ50 ద్వారా ఈ నెల 17న నింగిలోకి పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది.
బెంగళూరు: కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎంఎస్-01ను పీఎస్ఎల్వీ-సీ50 ద్వారా ఈ నెల 17న నింగిలోకి పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. పీఎస్ఎల్వీ 52వ మిషన్ అయిన పీఎస్ఎల్వీ సీ-50ను శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగవేదిక నుంచి ప్రయోగించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే డిసెంబరు 17వ తేదీ, 15:41 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించిన ఉపగ్రహం. దీని పరిమితి భారత్తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్లకు విస్తరిస్తుంది. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యునికేషన్ ఉపగ్రహం. పీఎస్ఎల్వీ-సీ50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా ఇది షార్ నుంచి 77వ మిషన్ అని వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?