గజవాహనంపై పద్మావతీ అమ్మవారు దర్శనం

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

Updated : 15 Nov 2020 20:16 IST

 

తిరుచానూరు: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు రాత్రి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో గజవాహనంపై దర్శనమిచ్చారు. పద్మావతీ అమ్మవారు శ్రీవారి లక్ష్మీహారాన్ని ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో గజ వాహనసేవ నిర్వహించారు. ఈ వాహనసేవలో పెదజీయర్‌ స్వామి, చినజీయర్‌ స్వామి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈవో బసంత్‌కుమార్‌, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టీ, అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని