ఈ పెంగ్విన్ల జంట.. చూడ ముచ్చటంట..!
రెండు పెంగ్విన్లు ఒకచోట చేరి నాకు నువ్వు..నీకు నేను అన్నట్లుగా ఒకదానిపై మరొకటి చేయి వేసుకొని సాంత్వన పొందుతున్నఓ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ప్రత్యేకంగా నిలిచిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి.
సిడ్నీ: రెండు ఒంటరి పెంగ్విన్లు ఒకచోట చేరి నాకు నువ్వు.. నీకు నేను అన్నట్లుగా ఒకదానిపై మరొకటి చేయి వేసుకొని సాంత్వన పొందుతున్న ఓ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి. జర్మన్కు చెందిన టోబియాస్ బామ్గార్ట్నర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ జంట పెంగ్విన్లను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో చిత్రించాడు. ఈ ఫొటో ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు ఓషియోనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే కమ్యూనిటీ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది.
కాగా.. ఈ రెండు పెంగ్విన్లు కొంతకాలం కిందట తమ భాగస్వాములను కోల్పోయాయని, ఆ తర్వాత ఈ రెండూ సమీపంలోని లైట్లను చూస్తూ ఒకచోట చేరాయని సదరు ఫొటోగ్రాఫర్ తెలిపారు. ఈ మధ్య ఒక వాలంటీర్ తనను కలిసి ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆడ వైట్ పెంగ్విన్ ఇటీవలే తన భాగస్వామిని కోల్పోయిందని, అలాగే దాని పక్కనున్న పెంగ్విన్ కూడా తన భాగస్వామిని కోల్పోయిందని చెప్పారన్నారు. మెల్బోర్న్లోని సెయింట్ కిల్డా పీర్ అనే బీచ్ దాదాపు 14 వందల రకాల పెంగ్విన్లకు నిలయం. ప్రస్తుతం ఈ పెంగ్విన్లు జంటగా ఉన్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో కామెంట్లను జత చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి