భారీ భద్రత మధ్య సచివాలయానికి జగన్
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించింది. నష్ట పరిహారం అంచనాలను డిసెంబరు...
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించింది. నష్ట పరిహారం అంచనాలను డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 40వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనావేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై కేబినెట్లో చర్చించినట్టు సమాచారం.
మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ సచివాలయానికి వెళ్తుండగా.. మందడంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మందడంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరం నుంచి రైతులు బయటకు రాకుండా రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ సీఎం సచివాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి రైతులకు భయపడి ఇంత భద్రత మధ్య సచివాలయానికి వెళ్లలేదని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్