పీహెచ్డీ చేసినా.. కూలిపనే దిక్కయింది!
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది.
కడప: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా కొందరు దినసరి కూలీలుగా మారుతున్నారు. కడప జిల్లా కాజీపేట మండలం తవ్వారిపల్లెకు చెందిన తవ్వ వెంకటయ్య పీహెచ్డీ చేసి ప్రైవేటు కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కథా రచయిత, పరిశోధకుడైన వెంకటయ్య వ్యాకరణ బోధిని, వ్యాసధార, యువతరం, సీమకథ, తొలకరి వంటి రచనలు చేశారు.
కరోనా ప్రభావంతో ఆయన ఉపాధి కోల్పోయారు. చదువుకునే సమయంలో చేసిన పని అనుభవంతో తిరిగి గృహనిర్మాణంలో బేల్దార్ వృత్తిని ఎన్నుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 2014 నవంబరులో యోగి వేమన యూనివర్సిటీ నుంచి ఆయన పీహెచ్డీ పొందారు. తరువాత ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పని చేయడం ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా కళాశాల మూసివేశారు. తిరిగి ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో గృహనిర్మాణ కూలీగా మారి బేల్దార్ పని చేపట్టారు. కుటుంబ పోషణ కోసం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిందేనని ఆయన చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్