ఆ విద్యార్థులు.. పరీక్షలకు వద్దు!
కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.
కరోనా వేళ పరీక్షలు: తాజా మార్గదర్శకాలివే..!
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ విద్యార్థుల ప్రవేశ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్ ఆపరేటింట్ ప్రొసీజర్(ఎస్ఓపీ)లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వారికి మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్ష రాసే ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు సవరించిన ఎస్ఓపీను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. లక్షణాలున్న వారు పరీక్ష రాయలనుకుంటే వారికి కూడా అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో తెలిపింది. తాజాగా ఈ వెసులుబాటును తొలగించింది. ఇది పరీక్షలు నిర్వహించే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. కేవలం కొవిడ్ లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బంది మాత్రమే పరీక్షా కేంద్రాలకు రావాలని స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ లక్షణాలున్న వారు పరీక్షకు హాజరైతే వారిని అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వాహణ అధికారులు తీసుకోవచ్చని తెలిపింది.
ఇక కంటైన్మెంట్ జోన్లలో ఉండే పరీక్ష నిర్వాహకులు, సిబ్బందికి పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని ఇదివరకు ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వీటితోపాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు