సర్పంచి పదవికి వేలం.. ఎన్ని కోట్లో తెలుసా!

ఆస్తులు వేలం వేయటం గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ... ఆ గ్రామంలో మాత్రం సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ పదవి కోసం ఒకరు ఏకంగా రూ. కోట్లు వెచ్చించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఉమ్రానె గ్రామంలో జరిగిందీ ఘటన.

Updated : 30 Dec 2020 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆస్తులు వేలం వేయటం గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ... ఆ గ్రామంలో మాత్రం సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ పదవి కోసం ఒకరు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఉమ్రానె గ్రామంలో జరిగిందీ ఘటన. 

గ్రామస్థులు అనధికారికంగా ఈ వేలం నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.5 కోట్లు వెచ్చించి విశ్వాస్‌ రావ్‌ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన వేలం రూ. కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే వేలం నిర్వహించారు. దేవరాను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని