మరో 3 రోజుల్లో సౌదీలో టీకా పంపిణీ!
సౌదీ అరేబియా మరో మూడు రోజుల్లో వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఫైజర్ టీకాను ఆమోదించిన వారంరోజుల్లోనే వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
దుబాయ్: సౌదీ అరేబియా మరో మూడు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఫైజర్ టీకాను ఆమోదించిన వారం రోజుల్లోనే వారీ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంగళవారం సాయంత్రం ప్రభుత్వం కోరింది. ఈ టీకాను మూడు దశల్లో ప్రజలకు అందించనున్నట్లు తెలిసింది.
మొదటి దశలో 65ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి టీకా ఇవ్వనున్నారు. వైరస్కు ఎక్కువ ప్రభావితం అయ్యేవారికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రెండో దశలో 50 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తారు. మూడో దశలో మిగతా అందరికీ టీకా వేయిస్తారు. వ్యాక్సిన్ పంపిణీ తేదీలు, తదితర వివరాలు ప్రభుత్వం తెలియజేయలేదు. బ్రిటన్, కెనెడా, అమెరికా ఇప్పటికే టీకా పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సౌదీలో ఇప్పటి వరకు 3,60,000 కరోనా కేసులు, 6,000 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో సౌదీ గల్ఫ్ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. కానీ రికవరీలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.