కరోనా నియంత్రణకు సింగరేణి చర్యలు

కరోనా వైరస్‌ నియంత్రణ, చికిత్సలకు సింగరేణి చర్యలు చేపట్టింది. సీఈఆర్‌ క్లబ్బులు, పాఠశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించాలని ..

Published : 21 Jul 2020 20:25 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణ, చికిత్సలకు సింగరేణి చర్యలు చేపట్టింది. సీఈఆర్‌ క్లబ్బులు, పాఠశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించాలని నిర్ణయించింది. ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హైదరాబాద్‌లోని 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో అంగీకారం కుదుర్చుకున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది.. వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా, బేసిక్‌పై 10 శాతం అలెవెన్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కొన్నాళ్లు గనులు మూసివేయాలని సింగరేణి నిర్ణయించింది. కార్మిక సంఘాల గేట్‌ మీటింగ్‌లకు 2 నెలలపాటు అనుమతి లేదని చెప్పింది. కరోనా సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని