ఎలుగుబంటి వచ్చి నిద్రలేపితే..!

ప్రశాంతంగా నిద్రపోతున్న ఓ వ్యక్తిని అక్కడకు వచ్చిన ఓ ఎలుగుబంటి నిద్రలేపిన సంఘటన

Published : 16 Sep 2020 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంతంగా నిద్రపోతున్న ఓ వ్యక్తిని అక్కడకు వచ్చిన ఓ ఎలుగుబంటి నిద్రలేపిన సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వింతైన ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటుచేసుకుంది. మాథ్యూ బేట్‌ అనే వ్యక్తి ఓ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద హాయిగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలోకి మెల్లగా ఓ ఎలుగుబంటి వచ్చింది. పూల్‌ వద్ద తిరుగుతూ అందులో నీరు కూడా తాగింది. అనంతరం బేట్‌ వద్దకు వచ్చి వాసన చూసింది. అతను కదలక పోవటంతో అది అతని కాలిని తన చేతితో తాకుతూ మెల్లగా తట్టి లేపింది. దీనితో నిద్ర నుంచి లేచి, షాక్‌ తినటం బేట్‌ వంతయింది! కాగా, అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని