గట్టిగా మాట్లాడకండి.. కరోనా వస్తుంది..!
హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభలో గట్టిగా మాట్లాడవద్దని సభ్యులను ఉద్దేశించి స్పీకర్ విపిన్ సింగ్ చేసిన సూచనలు అందరినీ నవ్వించేలా చేశాయి. అసలు విషయం ఏంటంటే..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభలో గట్టిగా మాట్లాడవద్దని సభ్యులను ఉద్దేశించి స్పీకర్ విపిన్ సింగ్ చేసిన సూచనలు అందరినీ నవ్వించేలా చేశాయి. అసలు విషయం ఏంటంటే.. కరోనా వైరస్ దృష్ట్యా అసెంబ్లీకి వచ్చే సభ్యులందరికీ కొవిడ్ నిబంధనలపై స్పీకర్ సూచనలు చేశారు. సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని చెప్పారు. అలా జాగ్రత్తలు చెప్పడంలో భాగంగా సభ్యులను గట్టిగా మాట్లాడవద్దని, అలా పెద్దగా వాదించడం ద్వారా కూడా కొవిడ్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పడంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ దృశ్యం సభికులందరినీ ఆకట్టుకుంది. అయినప్పటికీ సభలో కొందరు సభ్యులు ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించారు.
కాగా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న పాల్గొన్న వారిలో రీటా దేవీ అనే ఎమ్మెల్యేకు సాయంత్రం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడం గమనార్హం. ప్రస్తుతం హిమాచల్ శాసనసభ్యుల్లో మంత్రి మహేందర్ సింగ్, రీటాదేవీ, లక్విందర్సింగ్ ముగ్గురు కొవిడ్ బారిన పడ్డారు. వారిని సభకు రాకుండా హోమ్ క్వారంటైన్లో ఉండాలని స్పీకర్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్