లిబియాలో సిక్కోలు యువకులకు విముక్తి
ఉపాధి కోసం ఆఫ్రికాలోని లిబియా ప్రాంతానికి వెళ్లి అక్కడ అపహరణకు గురైన సిక్కోలు యువకులకు విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం
సంతబొమ్మాళి: ఉపాధి కోసం ఆఫ్రికాలోని లిబియా ప్రాంతానికి వెళ్లి అక్కడ అపహరణకు గురైన సిక్కోలు యువకులకు విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం నౌపాడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను లిబియా భారత దౌత్యాధికారులు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విడిపించారు. అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సెప్టెంబర్ 12వ తేదీన భారతదేశానికి వచ్చేందుకు సీతానగరం గ్రామానికి చెందిన బచ్చల జోగారావు, బచ్చల వెంకట్రావు, బొడ్డు దానయ్యలు త్రిపోలి విమానాశ్రయానికి వస్తూ మార్గం మధ్యంలో అదృశ్యమయ్యారు. వీరితోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులు ఆగంతకుల చేతిలో బంధీలయ్యారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. లిబియాలో అదృశ్యమైన వారికోసం గాలింపు చేపట్టాలని గత నెల 23న పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు కేంద్రానికి లేఖ రాశారు.
దీనిపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ లిబియాలో ఉన్న భారత దౌత్యాధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లిబియాలో వారికి ఉపాధి కల్పించిన సంబంధిత కంపెనీ యాజమాన్యంతో అధికారులు మాట్లాడగా.. అదృశ్యమైన ఏడుగురు యువకులు ఆగంతకుల చేతిలో బంధీలుగా ఉన్నారని సంబంధిత యాజమాన్యం అధికారులకు తెలిపింది. పలుమార్లు ఆగంతకులతో అక్కడి భారత దౌత్యాధికారులు, కంపెనీ యజమానులు చర్చలు జరిపారు. దీంతో 30రోజుల అనంతరం ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో బంధీలుగా ఉన్న యువకులను ఆగంతకులనుంచి విడిపించినట్లు భారత దౌత్యాధికారులు వెల్లడించారు. అనంతరం వారిని దౌత్యకేంద్రానికి తరలించారు. వారం రోజుల అనంతరం స్వదేశానికి పంపించనున్నట్లు బాధిత కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. దీంతో యువకులను విడిపించిన అధికారులకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు