వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాలు..

ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో కొన్ని వానరాలు పాల్గొని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాయి...

Updated : 04 Oct 2020 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కాలంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులే వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో కొన్ని వానరాలు పాల్గొని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాయి. ప్రతాప్‌గఢ్‌‌ జిల్లా బెల్హాలో ఓ వృద్ధురాలు మరణించింది. ఆ సమయంలో అక్కడకు చేరిన వానరాలు మృతదేహం చుట్టూ కూర్చున్నాయి. ఓ వానరమైతే  ఏకంగా మృతదేహం ఉన్న మంచంపై కూర్చుని కొంత సమయంపాటు అక్కడే ఉంది. ఈ దృశ్యం దుఃఖంలో ఉన్నవారిని వానరాలు ఓదార్చుతున్నట్లు కనిపించింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఈ వింతను చూసేందుకు పెద్దఎత్తున్న అక్కడకు చేరుకున్నారు. ఇలాంటి సంఘటన తమ గ్రామంలో ఎన్నడూ జరగలేదని, ఇది దేవుడి లీలగా వారు పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం చుట్టూ సుమారు రెండు గంటలపాటు కూర్చొని ఆ తర్వాత అక్కడినుంచి అవి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని