పాలకొల్లు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఇంజన్ పడవ గోదావరి మధ్యలో మరమ్మతుకు...
యలమంచిలి(ప.గో): తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఇంజన్ పడవ గోదావరి మధ్యలో మరమ్మతుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం బాడవ, వైవీ లంక గ్రామాలను సందర్శించేందుకు రామానాయుడు వెళ్లారు. పర్యటన ముగించుకుని గోదావరిలో చించినాడకు తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా మొరాయించింది. అసలే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం.. ఆపై పడవ మరమ్మతుకు గురవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
ఇంజన్ చెడిపోయిన పడవ నదీ ప్రవాహానికి వెనక్కి వెళ్లిపోతూ తూర్పుగోదావరి జిల్లా దిండి వైపు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే వంతెన ఫిల్లర్లను ఢీకొంది. అక్కడకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు పడవ చోదకుడు తాడు సాయంతో లంగరు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జరిగిన సంఘటనను నరసాపురం డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీలకు మొబైల్ఫోన్లో సమాచారం అందించగా.. తూర్పుగోదావరి వైపున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలకు సమాచారం అందించారు. యలమంచిలి ఎస్సై గంగాధర్ తదితరులు పడవపై వెళ్లి సురక్షితంగా ఎమ్మెల్యే సహా అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.