డప్పు వాయించిన నుస్రత్‌ జహాన్‌

సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడూ బీజీగా ఉంటుంటారు. అయితే ఏమాత్రం సమయం దొరికినా, పండుగలు వచ్చినప్పుడూ ప్రజలతో కలిసి ఆడిపాడటాన్ని మనం చూస్తుంటాం. అచ్చం అలాంటిదే ఈ ఘటన. వివరాల్లోకి వెళితే...

Published : 24 Oct 2020 23:59 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడూ బీజీగా ఉంటుంటారు. అయితే ఏమాత్రం సమయం దొరికినా, పండుగలు వచ్చినప్పుడూ ప్రజలతో కలిసి ఆడిపాడటాన్ని మనం చూస్తుంటాం. అచ్చం అలాంటిదే ఈ ఘటన. వివరాల్లోకి వెళితే... ప్రజలతో మమేకమవుతూ అన్నింటా తామే అన్నట్లు ఉంటున్న యువ ఎంపీల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన నుస్రత్ జహాన్‌ ఒకరు. పండుగలను నియోజకవర్గ ప్రజలతో కలిసి జరుపుకోవటం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. పండుగల సమయంలో ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు మరి. ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా ఆమె సందడి చేస్తున్నారు. తాజాగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి వెళ్లారామె. అక్కడికి వచ్చిన సామాన్య భక్తులతో కలిసి ఆడిపాడారు. డప్పూ వాయించారు. అంతేకాకుండా డప్పు శబ్దానికి లయబద్ధంగా నృత్యం చేశారు. అందరినీ ఆకట్టుకున్నారు. దుర్గాష్టమి వేళ అమ్మవారికి ప్రత్యేక పూజలూ నిర్వహించారు. 

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని