గోప్యంగా డీజీపీ ఆసిఫాబాద్‌ పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా...

Published : 02 Sep 2020 14:07 IST

ఆసిఫాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, రామగుండం సీపీ సత్యనారాయణ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నెల రోజుల క్రితం మావోయిస్టుల కదలికలపై డీజీపీ ఆరా తీశారు. హెలీప్యాడ్‌ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి ఉట్నూరు బయల్దేరి వెళ్లారు. మరోవైపు మహేందర్‌రెడ్డి పర్యటనను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని