ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్...
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఈనెల 19 నుంచి 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈనెల 20, 21 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈనెల 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 24 నుంచి తొలి విడత బీఫార్మసీ, ఫార్మ్ డీ సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 24 నుంచి 27 వరకు ఆన్లైన్లో బోధనా రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
డిసెంబరు 1న చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తుదివిడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 2న ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 5న తుది విడత సీట్లను కేటాయిస్తారు. తుది విడత కౌన్సెలింగ్లో సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబరు 5 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్ల స్పాట్ అడ్మిషన్ల కోసం డిసెంబరు 5న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్