1,750 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో ప్రత్యేక పోలీసు అధికారుల(ఎస్పీవో) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో హైదరాబాద్‌, రాచకొండ,

Published : 08 Sep 2020 01:02 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రత్యేక పోలీసు అధికారుల(ఎస్పీవో) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 1,750 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. మాజీ సైనికులను ప్రత్యేక పోలీసు అధికారుల నియమించనుంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 9 నెలల కాలానికి నెలకు రూ.20వేల వేతనం ఇవ్వనున్నారు.  హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 1,450, రాచకొండ 150, సైబరాబాద్‌ 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని