గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి గజవాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

Published : 24 Sep 2020 22:19 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి గజవాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ఆలయంలోని కల్యాణ మండపంలో గజవాహనంపై సర్వాంతర్యామిని అర్చకులు కొలువుదీర్చారు.

ఈరోజు ఉదయం హనుమంత వాహనంపై దర్శనమివ్వగా.. సాయంత్రం సర్వభూపాల వాహనంపై, రాత్రికి గజవాహనంపై శ్రీహరి అభయ ప్రదానం చేశారు. బ్రహ్మోత్సవ వేళ అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడుకి వాహనసేవలు నిర్వహిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని