డిక్లరేషన్‌ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వివరణ

శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ  తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం....

Updated : 19 Sep 2020 20:00 IST

తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు