సెప్టెంబరు 1 నుంచి తెరుచుకోనున్న తాజ్మహల్
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ పర్యాటకుల సందర్శన కోసం తిరిగి తెరుచుకోనుంది. సెప్టెంబరు 1 నుంచి ఆగ్రాలోని తాజ్మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు....
ఆగ్రా: అద్భుత కట్టడం తాజ్మహల్ను వీక్షించేందుకు పర్యాటకుల అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబరు 1 నుంచి ఆగ్రాలోని తాజ్మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్-19 నియంత్రణలో భాగంగా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అందులో భాగంగా పురావస్తుశాఖ పరిధిలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసి ఉంచారు. కొద్ది నెలలుగా విడతల వారీగా కేంద్రం లాక్డౌన్ నిబంధనలు సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జులై నుంచి కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలు కూడా తిరిగి తెరిచేందుకు అనుమతించింది.
దీనిని అనుసరించి తాజాగా ఆగ్రా జిల్లా కలెక్టర్ పీఎన్ సింగ్ తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిఖ్రీలను తొలి దశలో భాగంగా సందర్శకుల కోసం తెరిచేందుకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే పర్యాటకులు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కొవిడ్-19 కరోనా కారణంగా పర్యాటక రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఎంతో ప్రాముఖ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకోనుండటంతో ఆ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు ఎంతో మందికి ఉపాధి లభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్